సమంత ‘సామ్ జామ్’ కార్య‌క్ర‌మం కథ ముగిసినట్లేనా..!

సమంత అక్కినేని ప్రస్తుతం ఈ పేరు ఒక బ్రాండ్ గా మారింది. ఒక పక్క సినిమాలతో, మరో పక్క వెబ్ సిరీసుల్లో రాణీస్తూ క్రేజ్ సంపాదించుకుంటుంది. లాక్ డౌన్ లో కూడా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి ఓటీటీ లో హోస్ట్ గా మారింది. అయితే సమంత సామ్ జామ్ ప్రోగ్రామ్ పై మొదట్లో క్రేజ్ ఉన్నా.. ప్రస్తుతం ఆ డిమాండ్ సమంత మిస్ చేస్తుందని టాలీవుడ్ వర్గాలతో పాటు నెట్టింట్లోనూ వినపడుతోంది. అయితే ఈ ప్రోగ్రామ్ ని అత్యంత భారీ ప్రాజెక్ట్ గా ఆహా టీమ్ నడిపించింది. ప్రోమోలు.. ప్రమోషన్స్ తో టాప్ మోస్ట్ సెలెబ్రిటీలను సైతం పిలిపించి అలరించింది. దానికి తోడు సమంత చేసే అల్లరితో సామ్ జామ్ ప్రోగ్రామ్ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ ప్రోగ్రామ్ ఓటీటీలో రిలీజ్ కావడమే సమంత కు మైనస్ అయ్యింది. టీవీ చానెల్ లో కాకుండా రూరల్ ఏరియాల్లో ఓటీటీ పట్ల ఎక్కువమందికి అవగాహన లేక ప్రేక్షకుల నుండి స్పందన లేదు.

దీనికి తోడు ఈ కార్యక్రమంలో అయితే మెగా ఫ్యామిలీ, లేదంటే అక్కినేని ఫ్యామిలీస్ కి చెందిన వారే ఎక్కువగా రావడంతో ప్రోగ్రామ్ క్లిక్ అవ్వలేదని అంటున్నారు నెటిజన్లు. వీటితో పాటు టెలివిజన్ లో ఇప్పటికే ఇలాంటి స్టార్ హోస్ట్ ఇంటర్వ్యూలు ఎన్నో జరిగాయి. ప్రదీప్ యాంకర్ గా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, ఆలీ హోస్ట్ గా ఆలీతో సరదాగా లాంటి వాటిలాగే సామ్ జామ్ కూడా ఉందంటున్నారు.

ఏది ఎలా ఉన్నా.. మొత్తానికి సమంత హోస్ట్ గా చేస్తున్న ప్రోగ్రామ్ సామ్ జామ్ ను త్వరలోనే ముగించేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముందుగా ఈ సీజన్ ను పది ఎపిసోడ్స్ అనుకున్నారట ఆహా టీమ్. అయితే మరికొంతమంది ఈ సీజన్ కి ఎనిమిది ఎపిసోడ్స్ మాత్రమే.. నెక్ట్స్ సీజన్ కోసం మరింత ఎఫెక్ట్ పెట్టబోతున్నట్లు మరికొన్ని వార్తలు వైరలవుతున్నాయి. ఫైనల్ గా సమంత, తన భర్త చైతన్య తో కలిసి చేసిన ఇంటర్వ్యూతో ఈ ప్రోగ్రామ్ ని ముగిస్తున్నట్లు తెలుస్తుంది.