క‌రోనా టైంలోను టూర్స్ వేస్తున్న చై-సామ్.. న్యూ ఇయ‌ర్ కోసం ఎక్క‌డికి వెళుతున్నారో తెలుసా?

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో నాగ చైత‌న్య‌- స‌మంత జంట ఒక‌టి. ఎంతో చూడ‌ముచ్చ‌ట‌గా ఉండే ఈ జంట ఒక‌వైపు త‌మ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఖాళీ స‌మ‌యాల‌లో విహార‌యాత్ర‌లు వేస్తుంటారు. ఇక వెకేష‌న్‌కు సంబంధించిన ఫొటోల‌ను స‌మంత రెగ్యుల‌ర్‌గా త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌ను ఫుల్ థ్రిల్ చేస్తూ ఉంటుది. ఇటీవ‌ల మాల్దీవుల‌కి వెళ్లిన నాగ‌చైత‌న్య‌, స‌మంత మ‌ళ్ళీ ఇప్పుడు న్యూ ఇయ‌ర్ కోసం కాలు బ‌య‌ట‌పెట్టారు.

ప్ర‌తి సంవ‌త్సరం న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ని గోవాలో జ‌రుపుకోవ‌డం నాగ చైత‌న్య‌, స‌మంత‌కు ఆన‌వాయితీగా వ‌స్తుంది. ఈ సారి కరోనా మ‌హ‌మ్మారి ఉదృతి ఉన్న‌ప్ప‌టికీ రిస్క్ చేసి ఈ జంట గోవాకు బ‌య‌లు దేరారు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారమే వీరిద్దరు గోవా బయల్దేరారు. విమానాశ్రయంలో ఉన్న స‌మ‌యంలో చైతూ, సామ్‌లని తమ కెమెరాలో బంధించి ఫొటోలు వైర‌ల్ చేశారు. స‌మంత‌, నాగ చైత‌న్య‌లు ఇంత అన్యోన్యంగా ఉండ‌డం చేసి అభిమానులు కూడా చాలా మురిసిపోతున్నారు. 2017లో గోవాలోని ఓ రిసార్ట్‌లోనే వీరి వివాహం జరిగింది.

అక్కినేని కోడ‌లు స‌మంత ప్ర‌స్తుతం సినిమాల క‌న్నా డిజిట‌ల్ మీడియాపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది ఆహా అనే ఓటీటీ ప్లాట్ ఫాం కోసం సామ్ జామ్ షో చేస్తున్న స‌మంత చిరంజీవి, అల్లు అర్జున్, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి సెల‌బ్రిటీల‌ను ఇంట‌ర్వ్యూ చేస్తూ అల‌రిస్తుంది. మ‌రోవైపు ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ లో విల‌న్ పాత్రలో క‌నిపించ‌నుంది. న్యూ ఇయ‌ర్ కానుక‌గా దీనికి సంబంధించి అప్‌డేట్ రానుంది. మ‌రోవైపు నాగ చైత‌న్య కూడా ల‌వ్ స్టోరీ, థ్యాంక్యూ అనే చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.