మ‌ళ్ళీ ఫ్లైటెక్కిన మ‌హేష్ ఫ్యామిలీ.. ఈ సారి వెకేష‌న్ ఎక్క‌డికో అంటూ చ‌ర్చ‌లు

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఫ్యామిలీతో మాత్రం విలువైన స‌మ‌యాన్ని కేటాయిస్తాడు. లాక్‌డౌన్ వ‌ల‌న ఏ సినిమా షూటింగ్స్ లేక‌పోవ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మైన మ‌హేష్ చిన్న‌పిల్లాడిలా మారి త‌న‌యుడు గౌత‌మ్, కూతురు సితార‌తో క‌లిసి స‌రదాగా గ‌డిపాడు. ఇంట్లో మ‌హేష్ చేసే ర‌చ్చ‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను ఎప్పటిక‌ప్పుడు న‌మ్రత త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.

అయితే క‌రోనా ఉదృతి కాస్త త‌గ్గాక దుబాయ్ టూర్ వేసిన మ‌హేష్ ఫ్యామిలీ అక్క‌డ కొద్ది రోజులు స‌రదాగా గడిపారు. అనంత‌రం ముంబై వెళ్ళారు. అక్క‌డికి వెళ్లొచ్చాక తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో క‌లిసి హైద‌రాబాద్ లో క్రిస్మ‌స్, న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఇక ఈ నెల‌లో ప‌రశురాం తెర‌కెక్కిస్తున్న స‌ర్కారు వాటి పాట చిత్రాన్ని ప్రారంభిస్తాడ‌ని అంద‌రు అనుకుంటున్న స‌మ‌యంలో మ‌హేష్‌- నమ్రత- సితార- గౌతమ్ బ్యాగ్‌లు త‌గిలించుకొని ఎయిర్ పోర్ట్‌లో క‌నిపించారు.

అంద‌రిని ఎయిర్ పోర్ట్‌లో చూసే స‌రికి సూపర్ స్టార్ లేటెస్ట్ షార్ట్ ట్రిప్ ప్లాన్ చేశాడ‌ని అర్థమవుతోంది. ఈ సారి వెకేషన్ ఏ సాగర తీరానికి అన్నది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో మ‌హేష్ ఫ్యామిలీని ఫొటోగ్రాఫ‌ర్స్ కెమెరాలో బంధించ‌డంతో అవి వైర‌ల్‌గా మారాయి. ఈ ఫొటోలో మ‌హేష్ చాలా హ్యాండ్స‌మ్‌గా క‌నిపిస్తున్నారు. దాదాపు ఈ నెల‌లోనే స‌ర్కారు వారి పాట షూటింగ్‌ని మొద‌లు పెడ‌తార‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా, ఈ చిత్రాన్ని 2021లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం అంటున్నారు. ఈ మూవీ తర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు.