Kodali Nani: ప్రముఖ ఛానళ్లను నిషేధిస్తూ.. చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని..!

Kodali Nani: మరోసారి ఏపీ మంత్రి కొడాలి నాని రెచ్చిపోయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఈటీవీ, ఏబీఎన్, టీవీ 5 ఛానళ్లను నిషేధిస్తున్నామని ప్రకటించారు. వైసీపీ పార్టీ నాయకులు ఎవరూ కూడా ఈ ఛానళ్ళలకు ఇంటర్వ్యూ లు ఇవ్వకూడదని స్పష్టం చేస్తున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు, రామోజీరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్లు ఉంది టీడీపి మీడియా తీరు ఉందని.. హెరిటేజ్ లో రేట్ల కంటే మార్కెట్ రేట్ ఎక్కువగా ఉందని ఫైర్ అయ్యారు. హెరిటేజ్ లో ఆశీర్వాద్ గోధుమ పిండి కేజీ 59 ఉంటే మార్కెట్ రేట్ 52 రూపాయలు ఉందని.. అలాగే అన్ని నిత్యావసర సరుకుల ధరలు మార్కెట్ రేట్ కంటే హెరిటేజ్ లో ఎక్కువగా ఉన్నాయని నిప్పులు చెరిగారు. కొన్ని మీడియా తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎల్లో మీడియాతో చంద్రబాబు నాయుడు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు నీకు జీవితకాలం టైం ఇస్తున్నా. సీఎంగా జగన్‌ని దించి నువ్వు కుర్చీ ఎక్కితే నేను రాజకీయాలు వదిలి వెళ్లిపోతా. దమ్ముంటే నా ఛాలెంజ్‌ తీసుకోవాలి. హైదరాబాద్‌లో ఎయిర్ పోర్ట్, రింగురోడ్డు నువ్వే వేసినట్టు నిరూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా. ఎవరో చేసినదాన్ని నువ్వు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎంగిలిమెతుకుల కోసం పాకులాడే తత్వం నీది. కుల‌ పత్రికలు, కుల టీవీలు పెట్టుకుని రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూడొద్దు. రాష్ట్రానికి పట్టిన వైరస్, శని చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్‌ అయ్యారు.