దుమ్ము లేపుతున్న మాస్ మహ‌రాజా .. ట్రైల‌ర్‌తో కెరీర్‌లోనే స‌రికొత్త రికార్డ్ నెల‌కొల్పిన ర‌వితేజ‌

మాస్ మ‌హరాజా ర‌వితేజ‌కు ఉన్న అభిమాన గణం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా మాస్ ఆడియ‌న్స్‌ను ఆక‌ర్షించిన ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. రాజా ది గ్రేట్ చిత్రం త‌ర్వాత ర‌వితేజ ఒక్క స‌క్సెస్ కూడా సాధించ‌లేదు. దీంతో ప్ర‌స్తుతం త‌ను చేసిన క్రాక్ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు. గోపిచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన క్రాక్ చిత్రంలో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టించగా, రవిశంకర్, సముథ్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ లు పవర్ ఫుల్ విలన్స్ గా కనిపిస్తున్నారు.

థమన్ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, ఠాగూర్ మధు నిర్మాణం వహిస్తున్నారు. న్యూ ఇయ‌ర్ కానుక‌గా విడుదలైన ఈ చిత్ర ట్రైల‌ర్ దుమ్ము రేపుతుంది 24 గంట‌లు కూడా పూర్తి కాకముందే భారీ వ్యూస్ మరియు లైక్స్ తో రచ్చ చేస్తుంది. 20 గంటల్లోనే 6.2 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టడమే కాకుండా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. అంతేకాక 2 లక్షల మేర లైక్స్ సాధించి రవితేజ కెరీర్ లోనే సాలిడ్ రీచ్ అందుకున్న ట్రైలర్ గా నిలిచింది. ర‌వితేజ కెరీర్‌లో ఇది తొలిసారి అంటున్నారు. ఈ రికార్డ్ ర‌వితేజ‌కే కాదు వారి ఫ్యాన్స్‌కు కూడా స‌రికొత్త ఉత్సాహం క‌లిగిస్తుంది.

రవితేజ ప్ర‌స్తుతం ఖిలాడీ అనే చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ ర‌వితేజ‌కు 67వ మూవీ కాగా, ఇందులో డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. .జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ ‘ఖిలాడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.రీసెంట్‌గా చిత్రానికి సంబంధించి విడుద‌లైన లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంది.