రష్మీ దేనికైనా నువ్వు ప్రాణం పోయగలవు…రష్మీ పోస్ట్ పై స్పందించిన లైలా?

రష్మి గౌతమ్ ప్రస్తుతం వెండితెరపై సినిమాలలో నటించిన రాని గుర్తింపు ఈమెకు బుల్లితెర కార్యక్రమాల ద్వారా గుర్తింపు వచ్చిందని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈమె కేవలం ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే జబర్దస్త్ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ వారానికి మూడు రోజులపాటు బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఆ కార్యక్రమానికి యాంకర్ గా రష్మీ వ్యవహరిస్తున్నారు. అలాగే జబర్దస్త్ కార్యక్రమం నుంచి అనసూయ తప్పుకోవడంతో ఆమె స్థానాన్ని కూడా ఈమె ఆక్రమించి యాంకర్ గా కొనసాగుతున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన రష్మీ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. కొత్తవారు వచ్చేవరకు నన్ను భరించండి ప్లీజ్ అంటూ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ పై నటి లైలా స్పందించారు.

నటి లైలా గతంలో జబర్దస్త్ కార్యక్రమానికి కొన్ని వారాలుగా యాంకర్ గా వ్యవహరించారు. ఇలా వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అయితే రష్మీ చేసిన ఈ పోస్ట్ పై లైలా స్పందిస్తూ.. నువ్వు ఏ కార్యక్రమాన్నైనా అదరగొట్టేస్తావు.. యు విల్ రాక్ ది షో.. నువ్వు యాంకర్ గా చేసే ప్రతి కార్యక్రమానికి మీ యాంకరింగ్ తో ప్రాణం పోస్తావు..ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళు అంటూ ఈమె స్పందించి కామెంట్ చేయడంతో రష్మీ ఈ పోస్ట్ పై రిప్లై ఇస్తూ థాంక్యూ సో మచ్ మేడం ఈ మాటలు చాలు నాకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి అంటూ ఈమె రిప్లై ఇచ్చారు.