పూజా బాలీవుడ్ లో బిజీ అందుకే కియారా ని టాలీవుడ్ కి పంపుతోందా ..?

కియారా అద్వాని పేరు మళ్ళీ టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. ఇంతకు ముందు టాలీవుడ్ లో చేసింది రెండే రెండు సినిమాలు. కాని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు టాలీవుడ్ లో భారీ స్థాయిలో క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత కియారా కోసం చాలామంది మేకర్స్ ట్రై చేశారు. కాని మళ్ళీ తెలుగు సినిమాలలో కియారా నటించే సమయం దొరకలేదు. బాలీవుడ్ లో వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. రీసెంట్ గా అక్షయ్ కుమార్ నటించిన సౌత్ సూపర్ హిట్ ఫిల్మ్ కాంచన రీమేక్ లక్ష్మీ లో నటించింది.

Laxmii Makers Release New Poster After Changing The Title of Akshay Kumar  And Kiara Advani Starrer | India.com

ప్రస్తుతం ఇందూ కి జవానీ అన్న సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కియారా మళ్ళీ టాలీవుడ్ లో నటించడానికి ఒకే చెప్పిందన్న ప్రచారం మొదలవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధా కృష్ణ(చినబాబు) – నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్.. ఈ సినిమా కంప్లీట్ కాగానే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు.

ఇప్పటికే త్రివిక్రమ్ ..ఎన్టీఆర్ కోసం వేయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇంతకు ముందు త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బ్లాక్ బస్టర్ సాధించి ఉండటం తో మరోసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ మీద భారీ అంచనాలున్నా నెలకొన్నాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ జంటగా నటించే హీరోయిన్ విషయంలో పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి.

NTR 30 Movie | Cast, Release Date, Trailer, Posters, Reviews, News, Photos  & Videos | Moviekoop

ఇన్నాళ్ళు ఈ సినిమాలో పూజా హెగ్డే నటించే అవకాశాలున్నాయని ప్రచారమవగా ఇప్పుడు కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం పూజా బాలీవుడ్ లో రెండు భారీ సినిమాలకి సైన్ చేసింది. ఆ కారణంగానే పూజా రేంజ్ హీరోయిన్ అంటే కియారానే అని మేకర్స్ కియారాని తీసుకోవాలని భావిస్తున్నారట. మరి ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.