అగష్టు 22 నుండి బుల్లితెరపై ‘ఎన్టీఆర్’ సందడి

Evaru meelo koteeswarlu show starts from August 22nd in Gemini Tv

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక్క‌డ మనీతో పాటు… మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు,‘కల మీది… కథ మీది…. ఆట నాది… కోటి మీది’ అంటూ ఎన్టీఆర్ తనదైన మ్యానరిజంతో చెప్పిన డైలాగుల ప్రోమోలతో షో మీద హైప్ ఏర్పడింది. ఇక ‘షో’ ఎప్పుడు నుండి టెలికాస్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు షో నిర్వాహకులు తీపి కబురు చెప్పారు. జెమిని టీవీ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో అగష్టు 22వ తేదీ నుంచి ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

Evaru meelo koteeswarlu show starts from August 22nd in Gemini Tv
 

మీ జెమిని టీవీలో సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8:30 గంటలకు ప్రతి ఇంటికి వచ్చేస్తున్నా అంటూ తారక్ ఈ ప్రోమోలో చెప్పుకొచ్చాడు. గతంలో ‘స్టార్ మా’లో టెలికాస్ట్ అయిన ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’ గేమ్ షో ఇప్పుడు ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’గా జెమిని ఛానల్‌‌‌‌లో ప్రసారం కాబోతుంది. ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోకు నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌‌‌‌ లుగా చేశారు. ఇప్పుడు తారక్ తనదైన స్టైల్‌‌‌‌ లో ఈ షోను హోస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. గతంలో బిగ్ బాస్ సీజన్-1 లో తన వాక్ చాతుర్యంతో దుమ్ము దులిపిన తారక్ ఈ షోతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.