పెళ్లి వివాదంపై ప్రియమణి క్లారిటీ

Actress Priyamani has given clarity on the allegations coming about her marriage

కెరీర్ పరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ ప్రియమణికి ఇప్పుడు ఒక సమస్య ఎదురైంది. 2017లో ముస్తఫా అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్న ప్రియమణి దాంపత్య జీవితాన్ని అందంగా, ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని పలు సందర్భాలలో ఆమె వ్యక్తపరిచారు. అయితే ప్రియమణి భర్త ముస్తఫా కు ఇదివరకనే పెళ్లవగా వివిధ కారణాలతో ఫస్ట్ వైఫ్ తో 2010 నుండి దూరంగా ఉంటున్నారట. ఇప్పుడావిడ తన భర్తతో చట్టపరంగా విడాకులు తీసుకోలేదని,కాబట్టి ప్రియమణితో ముస్తఫా వివాహం చెల్లదని ఇంకా పలు ఆరోపణలు చేసింది. 

Actress Priyamani has given clarity on the allegations coming about her marriage

ఈ వ్యవహారంపై స్పందించిన ప్రియమణి తన భర్త, వివాహ బంధం గురించి ఓపెన్ అయ్యింది. ప్రియమణి మాటల్లో… “ముస్తఫా భర్తగా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా మ్యారేజ్ మీద వస్తున్న రూమర్స్ లో నిజం లేదు. మేము చట్టబద్దంగానే పెళ్లి చేసుకున్నాం. మా బంధంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారందరికి నేను చెప్పేది ఒక్కటే… మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం. ప్రస్తుతం నా భర్త అమెరికాలో ఉన్నారు. ప్రతి రోజు మేము ఫోన్‌ లో మాట్లాడుకుంటూ అన్ని విషయాలను పంచుకుంటాం. ఫోన్ మాట్లాడటం కుదరకపోతే కనీసం హాయ్‌, బాయ్‌ అని అయినా మెసేజ్ చేసుకుంటాం. ప్రతి విషయాన్ని షేర్‌ చేసుకుంటాం. ఏ బంధానికైనా అది చాలా అవసరం” అంటూ చక్కగా అందరకీ క్లారిటీ ఇచ్చేశారు.