రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పీజీ విద్యను పూర్తి చేసుకున్న 227 మంది స్పెషలిస్ట్ వైద్యులకు రాష్ట్రవ్యాప్తంగా 142 సెకండరీ ఆసుపత్రులలో పోస్టింగ్లు ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
ఇన్సర్వీస్ కోటాలో 12 వేర్వేరు విభాగాలలో పీజీ పూర్తి చేసిన ఈ వైద్యులను కౌన్సెలింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా కేటాయించినట్లు మంత్రి వివరించారు.
33 ఏరియా ఆసుపత్రులలో: 60 మంది
7 జిల్లా ఆసుపత్రులలో: 10 మంది
2 ఎంసీహెచ్ ఆసుపత్రులలో: ఇద్దరు స్పెషలిస్టులు
గూడూరు ఏరియా ఆసుపత్రికి అత్యధికంగా నలుగురు స్పెషలిస్టులను (చిన్నపిల్లల వైద్యుడు, రేడియాలజిస్ట్, చర్మవ్యాధి నిపుణుడు, పాథాలజిస్ట్) కేటాయించారు.
నియమితులైన 227 మందిలో ప్రధాన విభాగాలలో కేటాయించిన స్పెషలిస్టుల వివరాలు:
# గైనకాలజీ 35 మంది
# జనరల్ మెడిసిన్ 35 మంది
# జనరల్ సర్జరీ 30 మంది
# మత్తు వైద్యులు 26 మంది
# చిన్నపిల్లల వైద్య నిపుణులు 25 మంది
# ఎముకల వైద్యులు 18 మంది
# రేడియాలజిస్టులు 17 మంది
# ఇతర విభాగాలు (కంటి, ఈఎన్టీ నిపుణులు తదితరులు)

మిగిలిన వారికి ట్యూటర్లుగా అవకాశం 2022-23లో ఇన్సర్వీస్ కోటాలో పీజీ కోర్సుల్లో చేరిన మొత్తం 257 మంది పీహెచ్సీ వైద్యులు తమ కోర్సులు పూర్తి చేశారు.
227 మందిని సెకండరీ ఆసుపత్రులలో నియమించారు.
30 మందికి సెకండరీ ఆసుపత్రులలో ఖాళీలు లేకపోవడంతో డీఎంఈ (డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) పరిధిలోని ఆసుపత్రులలో ట్యూటర్లుగా అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.
త్వరలో మరిన్ని నియామకాలు ఈ నియామకాలతో పాటు త్వరలోనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు 155 మంది, 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరో 155 మంది స్పెషలిస్ట్ వైద్యులు విధుల్లో చేరతారని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
ఈ పోస్టింగ్లకు సంబంధించిన పూర్తి వివరాలను సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్బాబు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా. పద్మావతి మంత్రికి వివరించారు.

