ఏపీలో కొత్తగా 1,746 కరోనా కేసులు… గోదావరి జిల్లాలలో తగ్గని మహమ్మారి జోరు

Andhra pradeash state corona update

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 73,341 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,746 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 19,87,761 కి చేరింది. కరోనా కారణంగా చిత్తూరు-4, విశాఖ పట్నం-4, నెల్లూరు-3, తూర్పుగోదావరి-2, కృష్ణ-2, శ్రీకాకుళం-2 గుంటూరు-1, అనంతపూర్-1, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున ​మొత్తం 20 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,615 కి చేరింది.

Andhra pradeash state corona update

కరోనాబారి నుంచి నిన్న 1,648 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19,55,380 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 18,766 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,55,26,861 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే… అనంతపూర్-27, చిత్తూరు-203, తూర్పుగోదావరి-304, గుంటూరు-160, కడప-78, కృష్ణ-125, కర్నూలు-20, నెల్లూరు-235, ప్రకాశం-106, శ్రీకాకుళం-91, విశాఖపట్నం-115, విజయనగరం-26, పశ్చిమ గోదావరిలలో-261 చొప్పున కేసులు నమోదయ్యాయి.

గమనిక: కరోనాను కట్టడికి ప్రస్తుతం వాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. భౌతిక దూరం పాటించండి, మాస్క్ ధరించండి, చేతులను శుభ్రంగా శానిటైజ్ చేసుకోండి.