కరోనా అప్డేట్: ఏపీలో నిన్న 65,500 పరీక్షలు… కొత్తగా 1,506 పాజిటివ్‌ కేసులు

Andhra pradesh State corona update

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 65,500 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,506 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 19,90,802 కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 1,835 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19,59,290 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 17,865 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,56,61,449 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Andhra pradesh State corona update
 

కరోనా కారణంగా చిత్తూరు-4, కృష్ణ-4, తూర్పుగోదావరి-2, విశాఖ పట్నం-2, గుంటూరు-1, శ్రీకాకుళం-1,నెల్లూరు-1, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున ​మొత్తం 16 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,647 కి చేరింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే… అనంతపూర్-23, చిత్తూరు-217, తూర్పుగోదావరి-319, గుంటూరు-162, కడప-27, కృష్ణ-98, కర్నూలు-15, నెల్లూరు-181, ప్రకాశం-102, శ్రీకాకుళం-45, విశాఖపట్నం-75, విజయనగరం-72, పశ్చిమ గోదావరిలలో-170 చొప్పున కేసులు నమోదయ్యాయి.

గమనిక: కరోనాను కట్టడికి ప్రస్తుతం వాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. భౌతిక దూరం పాటించండి, మాస్క్ ధరించండి, చేతులను శుభ్రంగా శానిటైజ్ చేసుకోండి.