ఏపీ కరోనా అప్డేట్ … స్వల్పంగా పెరిగిన కేసులు

Andhra pradesh corona update

ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 85,822 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 2,442 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 19,71,101 కి చేరింది. కరోనా కారణంగా చిత్తూరు 5, అనంతపూర్ 2, కృష్ణ 2, నెల్లూరు 2, తూర్పుగోదావరి 1, గుంటూరు 1, విశాఖపట్నం 1, కడప 1,కర్నూల్ 1 చొప్పున మొత్తం 16 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,444 కి చేరింది.

Andhra pradesh corona update

కరోనాబారి నుంచి నిన్న 2,412 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19,37,473 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,48,63,968 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే… అనంతపూర్-45, చిత్తూరు- 433, ఈస్ట్ గోదావరి-477, గుంటూరు- 170, కడప- 144, కృష్ణ- 308, కర్నూల్- 56, నెల్లూరు-248, ప్రకాశం- 228, శ్రీకాకుళం- 81, విశాఖపట్నం- 77, విజయనగరం- 23, వెస్ట్ గోదావరి-153 చొప్పున కేసులు నమోదయ్యాయి.

గమనిక: కరోనాను కట్టడి చేయాలంటే వాక్సిన్ తీసుకోవాలి. అంతేకాకుండా నిబంధనలను పాటించటం తప్పనిసరి.