ప్రస్తుతం టాలీవుడ్ దగ్గర మంచి అంచనాలు నెలకొన్న టాలీవుడ్ చిత్రాల్లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత
మెయిన్ లీడ్ లో నటించిన భారీ పాన్ ఇండియా సినిమా “శాకుంతలం” కూడా ఒకటి.
కాగా ఈ సినిమాని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించగా ఈ సినిమాని తాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో అయితే తీశారు.
ఇది వరకే వచ్చిన ఈ చిత్రం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా సినిమా రిలీజ్ ని కూడా ఈ ఫిబ్రవరి 17కి ఫిక్స్ చేశారు.
ప్రతిరోజు కానీ ఈ సినిమా మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతూ వస్తుంది. అలాగే ఈ డేట్ నుంచి కూడా సినిమాని మేకర్స్ వాయిదా వేయగా ఇపుడు చిత్ర యూనిట్ సరికొత్త రిలీజ్ డేట్ ని తాము రివీల్ చేశారు.
మరి ఈ సినిమా ఈసారి వచ్చే ఏప్రిల్ 14న గ్రాండ్ ఫా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.
మరి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆ రోజు రిలీజ్ కానుంది. ఇక ఈ డేట్ కి అయినా సినిమా వస్తుందో లేదో అని కొందరు డౌట్ పడుతున్నారు.
ఇక ఈ భారీ సినిమాలో సమంత తో పాటుగా దేవ్ మోహన్ మోహన్ బాబు, అల్లు అర్హ తదితరులు కీలక పాత్రల్లో నటించగా మణిశర్మ సంగీతం అందించారు.
అలాగే దిల్ రాజు మరియు నీలిమ గుణ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.